ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!

28 Mar, 2024 19:03 IST|Sakshi

యే రిష్తా క్యా కెహ్లతా హై అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి మోహెనా కుమారి సింగ్. ఆ తర్వాత నయా అక్బర్ బీర్బల్, సిల్సిలా ప్యార్ కా, ప్యార్ తునే క్యా కియా, కుబూల్ హై లాంటి సిరీస్‌ల్లో కనిపించింది. ఆ తర్వాత సుయేష్ రావత్‌ను 2019లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇప్పటికే అయాన్ష్‌ అనే బాబు కూడా ఉన్నారు .

తాజాగా బుల్లితెర భామ మోహెనా సింగ్‌ రెండోసారి గర్భం ధరించింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన భర్తతో కలిసి ఉన్న బేబీ బంప్‌ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా మోహెనా కుమారి సింగ్‌కు సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  అయితే ఆమె కేవలం నటిగా మాత్రమే కాదు.. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari)


 

Election 2024

మరిన్ని వార్తలు