More

రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలకే ఎక్కువ పెట్టుబడులు

17 Jun, 2022 13:42 IST

మే నెలలో డీల్స్‌  42 శాతం అప్‌ 

2022 మే నెలలో  5.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

ముంబై: దేశీయంగా గత నెలలో పీఈ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 2021 మే నెలతో చూస్తే 42 శాతం ఎగసి 5.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే ఈ  ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 7.5 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 29 శాతం క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం డీల్‌ పరిమాణం భారీగా పెరిగింది.

గతేడాది మేలో నమోదైన 66 నుంచి 109కు డీల్స్‌ సంఖ్య ఎగసింది. ఈ ఏప్రిల్‌లో మాత్రం ఇంతకంటే అధికంగా 117 లావాదేవీలు జరిగాయి. 2022 మే నెలలో ప్రధానంగా రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలు అధిక పెట్టుబడులను సాధించాయి. 1.7 బిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ నమోదయ్యాయి. ఇక 10 కోట్ల డాలర్ల విలువైన 14 భారీ డీల్స్‌ సైతం మే నెలలో జరిగాయి. వీటి మొత్తం విలువ 3.9 బిలియన్‌ డాలర్లుకాగా.. అపోలో గ్లోబల్‌ నుంచి అదానీ గ్రూప్‌ నిర్వహణలోని ముంబై ఎయిర్‌పోర్ట్‌ సమీకరించిన 75 కోట్ల డాలర్లు వీటిలో కలసి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టెక్‌ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్‌!

సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీ స్టాక్‌ సూచీలు

అంబులెన్స్‌కి కాల్‌ చేసి.. పోయే ప్రాణాలను నిలబెట్టిన స్మార్ట్‌వాచ్‌!

ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

ఆరోగ్యం కోసం వివిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు