డయాబెటిస్ కారణంగా వరికి బదులు గోధుమలు తింటున్నారా?
14 Oct, 2019 18:31 IST
ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్ పేషెంట్స్ తప్పక ఉంటున్నారు. వీళ్లలో చాలామంది తమ రాత్రి భోజనంలో వరి అన్నం తినే బదులు గోధుమ రొట్టెలను తింటుండటం చాలా ఇళ్లలో చూస్తున్నాం.ఒక పిండి పదార్ధాన్ని (కార్బోహైడ్రేట్స్ను) తీసుకున్నప్పుడు అందులోంచి వెలువడే చక్కెర, దాని వల్ల శరీరానికి సమకూరే శక్తిని గ్లైసీమిక్ ఇండెక్స్ అనే కొలతలో చెబుతారు. నిజానికి వరి అన్నం, గోధుమ రొట్టె... ఈ రెండింటి గ్లైసీమిక్ ఇండెక్స్ ఒక్కటే. అంటే వరిలోనూ, గోధుమలోనూ ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి వెలువడే చక్కెరపాళ్లు దాదాపుగా ఒకటే.