ఉట్నూర్ ఐటీడీఏ ఈఈ ఇంటిపై దాడులు

12 Jan, 2018 11:59 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఈఈ రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఘా పెట్టిన ఏసీబీ శుక్రవారం తనిఖీలు చేపట్టింది.  

హైదరాబాద్, వరంగల్‌, ఉట్నూరు సహా 8 చోట్ల అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. రమేశ్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, గడిచిన రెండేళ్లుగా రమేష్‌ ఐటీడీఏ ఈఈగా పని చేస్తున్నారు. గతంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.
 

మరిన్ని వార్తలు