జగన్‌కు మద్దతుగా రాస్తారోకో

31 Aug, 2013 06:08 IST|Sakshi

కదిరి అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం రాత్రి ఆ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు సుధాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో  205 జాతీయ రహదారిపైనున్న  అంబేద్కర్ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలంటూ తమ నాయకుడు జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే ఆయన దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు.  
 
 ఆస్పత్రిలో కనీసం కుటుంబ సభ్యులను కూడా ఆయన వద్దకు అనుమతించక పోవడం దారుణమని విమర్శించారు. పట్టణ ఎస్సై తబ్రేజ్ అక్కడికి చేరుకుని రాస్తారోకో విరమించాలని ఆందోళన కారులను కోరగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇస్మాయిల్ తదితరులను  బలవంతంగా పోలీసు జీపు ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు చాంద్‌బాషా, లింగాల లోకేశ్వరెడ్డి, శివారెడ్డి, మాధురి రాజారెడ్డి,  జాఫర్‌ఖాన్, ఇమ్రాన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు