దాచేపల్లి: డెంగీ జ్వరంతో బాధపడుతున్నబాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కమ్మలపల్లి మౌనిక(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ స్థానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందింది.