టాటా ఏస్, లారీ ఢీ: ఒకరి మృతి

15 Apr, 2016 11:58 IST|Sakshi

చెన్నూరు: వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం పాలంపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం, మినీలారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వీరపునాయునిపల్లె మండలానికి చెందిన వీరంతా ఒంటిమిట్టలోని రామాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు