ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి

13 May, 2015 09:06 IST|Sakshi

యాదమరి (చిత్తూరు): చిత్తూరు జిల్లా యాదమరి మండలం కాశీరాలగొల్లపల్లి గ్రామం వద్ద ఓ ఇంట్లోకి లారీ దూసుకుపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒక గొర్రె మృతిచెందగా, ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. వివరాలు...చిత్తూరు నుంచి తమిళనాడులోని గుడియాత్తం వైపు వెళుతున్న లారీ కాశీరాలగొల్లపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఈ సంఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న గొర్రెలకాపరి కన్నయ్య మందడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే యాదమరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యడు.

>
మరిన్ని వార్తలు