10 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

15 Aug, 2015 19:49 IST|Sakshi

చుండుపల్లి (వైఎస్సార్‌జిల్లా) : పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.12,270 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా చుండుపల్లి మండలం ఉడుంపాడు గ్రామం గోపాలకృష్ణాపురం వద్ద శనివారం జరిగింది. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 10 మందిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు.

మరిన్ని వార్తలు