పిచ్చికుక్క దాడి: 10 మందికి గాయాలు

12 Jan, 2016 10:10 IST|Sakshi
నెల్లిమర్ల : విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలో మంగళవారం ఉదయం పిచ్చికుక్క వీరవిహారం చేసింది.  వీధిలో కనిపించినవారిపై దాడి చేసి గాయపరించి. పిచ్చికుక్క దాడిలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో పలుమార్లు పిచ్చికుక్కలు స్వైర విహారం చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
>
మరిన్ని వార్తలు