ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు

20 Sep, 2013 12:59 IST|Sakshi

కొత్తపట్నం మండలం గుత్తికుండవారిపాలెంలో శుక్రవారం గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. దాంతో ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు