మృతిచెందిన కోళ్ల విక్రయం

21 Mar, 2020 13:13 IST|Sakshi
చికెన్‌ దుకాణంలో ఉన్న మృతిచెందిన కోళ్లు

గుర్తించిన మున్సిపల్‌ కమిషనర్‌   

రూ.10 వేల జరిమానా విధింపు   

విజయనగరం, సాలూరు: కరోనాపై అవగాహన కల్పించేందుకు, సాధారణ తనిఖీల నిమిత్తం శుక్రవారం పెదబజారులో మున్సిపల్‌ కమిషనర్‌ నూకేశ్వరరావు సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ క్రమంలో ఓ చికెన్‌ దుకాణం సమీపంలో వేలాడదీసి ఉన్న మృతిచెందిన కోళ్లను గుర్తించారు. కమిషనర్‌ను చూసిన సదరు దుకాణదారుడు పారిపోయాడు. వెంటనే సిబ్బందితో కలిసి కమిషనర్‌ దుకాణంలోకి వెళ్లి పరిశీలించారు. మరణించిన కోళ్లను శుభ్రపరిచి ఐస్‌బాక్స్‌లో పెట్టి ఉండడాన్ని గమనించారు. ఆ కోళ్లను  సిబ్బందితో ప్రత్యేక మున్సిపల్‌ వాహనంలో స్థానిక డంపింగ్‌ యార్డ్‌కు తరలించి, వాటిని పాతిపెట్టారు. సదరు చికెన్‌ వ్యాపారి కొలిసి అక్కయ్యకు రూ.10 వేల జరిమానా విధించినట్లు కమిషనర్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయాలని పట్టణ ఎస్సై శ్రీనువాసరావును కోరారు.

మరిన్ని వార్తలు