లారీ ఢీకొని బాలుడు మృతి

20 Feb, 2016 15:41 IST|Sakshi

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని బొమ్మూరు ప్రాంతంలో శనివారం లారీ ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్‌పై ఇద్దరు బాలురు వెళుతుండగాశనివారం మధ్యాహ్నం లారీ ఢీకొంది. శాంతన్ (10) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు