800 కిలోల గంజాయి పట్టివేత

20 Feb, 2016 16:26 IST|Sakshi

మాడుగుల: విశాఖపట్నం జిల్లా మాడుగుల ఘాట్ రోడ్డులో 800 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి గంజాయి తరలిస్తున్న వ్యానును పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మాడుగుల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు