తూర్పుగోదావరి : ‘మమ్మల్నిఆదుకో అన్నా!’ అంటూ పెదపూడి మండలం 104 ఉద్యోగులు జగన్ను కోరారు. 2008లో వైఎస్ హయాంలో తామంతా ఉద్యోగాలు పొందామని, 2010లో సమ్మె అనంతరం తమను ప్రభుత్వోద్యోగులుగా పరిగణించారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక తమను తిరిగి ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించారని వాపోయారు. ‘మీరు సీఎం అయ్యాక మాకు ఉద్యోగ భద్రత కల్పించా’లని జీవీవీ సత్యనారాయణ, భారతి, భువనేశ్వరి, శ్యామల జననేతను కోరారు.