ఒక్క‌రోజే 11 మందికి పాము కాట్లు

20 Jul, 2020 18:52 IST|Sakshi

సాక్షి, పామర్రు: కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో పాముకాటుకు గుర‌వుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో ఒక్క రోజునే 11మంది  వ్య‌వ‌సాయ కూలీలు పాముకాటుకు గుర‌య్యారు. వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని వైద్యులు పేర్కొన్నారు. స‌కాలంలో ఆస్పత్రికి తీసుకురావ‌డంతో ముప్పు త‌ప్పింద‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ‌ ప‌నులు చేసే రైతులు, కూలీలు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని  డాక్టర్‌ శొంఠి శివరామకృష్ణారావు సూచించారు. వ‌ర్షాకాలం కావ‌డంతో పాము కాటుకు గురువుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. తమ ప్రాంతంలో గ‌త 20 రోజుల్లోనే 74 పాముకాటు కేసులు వెలుగుచూసిన‌ట్లు ఆయ‌న వెల్లడించారు.

మరిన్ని వార్తలు