వ్యాను బోల్తా... 12 మందికి గాయాలు

17 Apr, 2016 13:54 IST|Sakshi

పార్వతీపురం : వారపు సంతకు వెళుతున్న గిరిజనులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కొత్తవలస వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యాను బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయపడ్డారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. వారిని పార్వతీపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుమ్మడలో జరిగే వారపు సంతకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు