అనంతపురం: ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 ఏళ్ల మూగ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు పాల్పడ్డారు. ఆ దుండగుల కిడ్నాప్ ఘటనను స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మూగ బాలికను ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.