14 నుంచి భూసేకరణ: ప్రత్తిపాటి

2 May, 2015 01:57 IST|Sakshi

తుళ్లూరు: రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ఈ నెల 14 నుంచి భూసేకరణ చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనికి సంబంధించి 14వ తేదీ కంటే ముందే నోటిఫికేషన్ ఇచ్చి, ఆ విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని వివరించారు. రాజధాని నిర్మాణం ప్రాధాన్యత రీత్యా భూసేకరణకు కోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.


రాజధాని ప్రాంతంలో మొత్తం 27వేల రైతు ఖాతాలకు నగదు జమ చేసినట్టు చెప్పారు. కాగా ఈ నెల ఏడు నుంచి రైతు రుణ విముక్తి ప్రచార యాత్ర నిర్వహించనున్నట్టు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ 13 జిల్లాల్లో కొనసాగే ఈ యాత్రను ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు