140 కిలోమీటర్ల మారథాన్!

2 Feb, 2016 03:20 IST|Sakshi
140 కిలోమీటర్ల మారథాన్!

కల్యాణదుర్గం: స్పెయిన్ దేశస్తుడు జువాన్ మాన్యుయెల్ అనంతపురం జిల్లాలో 140 కిలోమీటర్ల మారథాన్ చేపట్టాడు. కల్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి ఎస్సీ కాలనీ నుంచి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పరుగు ప్రారంభించాడు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఆర్డీఓ రామారావు, ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛోఫై, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్నేఫై తదితరులు మారథాన్‌ను ప్రారంభించారు. ప్రతి కిలోమీటరుకు ఒక విద్యార్థి చొప్పున దత్తత తీసుకుంటానని మాన్యుయేల్ తెలిపాడు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ స్ఫూర్తితో ఈ మారథాన్ ప్రారంభించినట్లు పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు