15మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

3 Sep, 2015 18:10 IST|Sakshi

న్యూజెండ్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం రవ్వరమ్ము గ్రామ శివార్లలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.21 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు