15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

5 Oct, 2014 01:29 IST|Sakshi
15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ నెల 15న హైదరాబాద్ రానున్నారు. 16న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశముంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణ మాఫీపై తీసుకుంటున్న చర్యలను ఆయన వద్ద ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు