డ్రైన్‌లో పడి బాలుడు గల్లంతు

16 Apr, 2015 18:23 IST|Sakshi

తూర్పుగోదావరి: ఇంటిపక్కనే ఉన్న డ్రైన్లో పడి 15 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. మామిడి కుదురు మండలం లుతుకర్రు అనేగ్రామంలో రచ్చా రవికుమార్ (15) అనే బాలుడు ఇంటి పక్కనే ఉన్న డ్రైన్‌లో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. స్థానికులు బాలుడి ఆచూకీ కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
(మామిడికుదురు)

మరిన్ని వార్తలు