నర్సీపట్నంలో భారీగా గంజాయి స్వాధీనం

29 Nov, 2013 10:01 IST|Sakshi

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీ ఎత్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, నర్సిపట్నం స్టేషన్కు తరలించారు. అలాగే గంజాయి తరలింపునకు వినియోగించిన కారును పోలీసులు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు.   
 

మరిన్ని వార్తలు