పాలమూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం

16 Oct, 2013 10:43 IST|Sakshi

మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం ఎండపెట్ల గ్రామంలో బుధవారం గత అర్థరాత్రి 16 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు తెలిపింది. దాంతో వారు బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే స్పందించారు.

 

కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నాగర్ కర్నూల్ పోలీసులు తెలిపారు. అయితే సామూహిక అత్యాచారానికి గురైన యువతిని మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు