సాక్షి, తాడేపల్లి గూడెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 169వ రోజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉదయం పిప్పర శివారు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం అగ్రహారపు గోపవరం, ముగ్గళ్ల క్రాస్, అర్థవరం, వరదరాజ పురం మీదుగా వెలగపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి గొల్లదిబ్బ, గణపవరం మీదుగా సరిపల్లి వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : జననేత వైఎస్ జగన్ పాదయ్రాత 168వరోజు ముగిసింది. మంగళవారం పెంటపాడు, బోడుపాడు క్రాస్, ముదునూరు, కాశిపాడు క్రాస్, చిలకంపాడు, వీరేశ్వరపురం క్రాస్ మీదుగా పిప్పర వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగింది. నేడు 12 కిలోమీటర్లు నడిచిన మొత్తం 2,105.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.