18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

26 Sep, 2015 12:02 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం భానుపల్లి చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి అటవీ అధికారులు 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో టాటా ఏస్ వాహనంలో 303 కిలోల బరువైన 18 దుంగలను తరలిస్తుండగా వెలుగు చూశాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీ రేంజ్ అధికారి పిచ్చయ్య శనివారం మీడియాకు తెలిపారు.
 

మరిన్ని వార్తలు