18న చలో పార్లమెంట్ :కృష్ణయ్య

10 Feb, 2014 00:10 IST|Sakshi
18న చలో పార్లమెంట్ :కృష్ణయ్య


 హెదరాబాద్, న్యూస్‌లైన్: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 18న ‘చలో పార్లమెంట్’ చేపడుతున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. స్థానిక బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన సంఘం కోర్ కమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు అన్ని పార్టీలూ అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలుగా పుట్టడమే పాపమైనట్టుగా ఉందన్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ పార్టీల నాయకులను, ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలిసి డిమాండ్లపై చర్చిస్తామన్నారు. సమావేశంలో జె. శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు