ఏపీలో మరో 1914 పాజిటివ్‌ కేసులు

12 Jul, 2020 15:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,914 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 18 మంది, విదేశాల నుంచి వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 846 మంది క్షేమంగా డిశ్చార్జ్‌  కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం15,412 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (కర్నూలులో ప్లాస్మాథెరపీ ప్రారంభం)

గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కర్నూలులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు.. చిత్తూరు,నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 19 మంది మరణించారు. ఇప్పటి వరకు ఏపీలో 328 మంది కరోనా వైరస్‌ సోకి మృతిచెందారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 17,624 మందికి కరోనా శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటివరకు 11,53,849 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 13,428 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (ప్రత్యేక పరిస్థితుల్లోనే గాలి ద్వారా వ్యాప్తి)

మరిన్ని వార్తలు