192 కేజీల గంజాయి పట్టివేత

16 Jul, 2016 10:53 IST|Sakshi

విశాఖపట్నం: ప్రభుత్వాసుపత్రికి చెందిన అంబులెన్స్లో గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 192 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో శనివారం చోటు చేసుకుంది. లంబసింగి పీహెచ్సీకి చెందిన అంబులెన్స్లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ఆగంతకుడు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంబులెన్స్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు