ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి

11 Jan, 2015 01:10 IST|Sakshi

 కాకినాడ క్రైం : బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఏడేళ్ల బాలిక మృతి చెందగా ఆమె తండ్రి, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగన్నాథపురం ఏటిమొగకు చెందిన రేకాడి నూకరాజు, కుమార్తె శ్రీదుర్గ (7), బంధువు వెంకటేష్ పెదపూడి మండలం అచ్యుతాపురత్రయంలో పెళ్లికి వె ళ్లి శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా జెడ్పీ సెంటర్ సర్కిల్ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొంది. బైకుపై నుంచి బస్సు వెళ్లడంతో శ్రీదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ముగ్గురినీ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా శ్రీదుర్గ అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. నూకరాజు పరిస్థితి విషమంగా ఉంది. త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు