బొగ్గు గనిలో ప్రమాదం, ఇద్దరు మృతి

11 Jan, 2014 09:22 IST|Sakshi

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూ టెక్ బొగ్గు గనిలో శనివారం ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న కార్మికులపై ప్రమదవశాత్తు పైకప్పు కూలి బండరాయి పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరి కొందరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కాగా అధికారులు.... క్షతగాత్రులను గని నుంచి బయటకు తీసుకు వచ్చే చర్యలు చేపట్టారు.ఈ సంఘటనపై కార్మికులు ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు