కరెంట్‌షాక్ తో ఇద్దరి మృతి

7 Sep, 2015 09:19 IST|Sakshi

వైఎస్సార్: వైఎస్ఆర్ జిల్లా కడప నగరం శంకరాపురంలోని థమ్స్‌ అప్ గోడౌన్ సందులో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కరెంటు తీగలు తెగి ఎక్కడివక్కడ తెగిపడ్డాయి. దీంతో గమనించని స్థానికులు యథా విధిగా నడుచుకుంటూ వెళ్లటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్థానికంగా నివసిస్తున్న తిరిగిరెడ్డి వెంకటలక్ష్మీ(40) అనే మహిళతో పాటు, బి.శ్రీహరి(42) అనే మరో వ్యక్తి కరెంటు షాక్ తో అక్కడికక్కడే మరణించారు.
 

మరిన్ని వార్తలు