బైక్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

20 Sep, 2015 18:40 IST|Sakshi

అనంతపురం(చిలమత్తూరు): చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్టు సమీపంలో బైక్‌ను కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చోలుశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. కారు కర్ణాటకకు చెందిన వ్యక్తులదని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు