ఆర్టీసీ బస్సు బోల్తా, ఏడుగురికి గాయాలు

15 Apr, 2015 18:28 IST|Sakshi

చిత్తూరు(శ్రీకాళహస్తి): చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 47మంది ప్రయాణికులున్నారు.

మరిన్ని వార్తలు