కల్హేర్, న్యూస్లైన్: కలుషితమైన నీటిని తాగడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మం డలంలోని సిర్గాపూర్ జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు చెందిన విద్యార్థులు వంశీ, సాయికుమార్, శివరాజు, ఈశ్వర్గౌడ్, గోవర్ధన్, అనిల్, సతీష్, సక్కుబాయి, సునీత, సంధ్యారాణి తో పాటు మొత్తం 20 మంది విద్యార్థులు వాం తులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల హెచ్ఎం పవన్కుమార్, ఉపాధ్యాయు లు మహేశ్వర్రావు, రహీం సకాలంలో స్పం దించి విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులను స్థానిక ప్రథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. వైద్యాధికారి మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యసేవాలు అందజేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన అనంతరం ఇంటికి పంపించారు.
బోరు నుంచి ఎరుపుగా నీరు..
విద్యార్థులు మధ్యాహ్నభోజనం చేశాక పాఠశాలకు సంబంధించిన బోరు నీటిని తాగడంతో అస్వస్థతకు దారితీసింది. ఉదయం బోరు నుంచి ఎరుపు రంగులో నీరు వచ్చిందని హెచ్ఎం పవన్కుమార్ తెలిపారు. పాఠశాల పరిసరాల్లో పెంట కుప్పలు ఉండటం కూడా బోరు నీరు కలుషితానికి కారణమైంది. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయన్ని జిల్లా విద్యాధికారి రమేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంఈఓ మన్మథకిషోర్ తెలిపారు.