విశాఖలో 200 కిలోల గంజాయి పట్టివేత

12 Apr, 2015 11:38 IST|Sakshi

విశాఖపట్టణం: అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్టణం జిల్లా పాడేరు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. పాడేరుకు చెందిన డి.వెంకటకొండారావు అనకాపల్లికి  తన కారులో అక్రమంగా 200 కిలోల గంజాయిని తరలిస్తున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి అతడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేశారు. కాగా, ఈ గంజాయి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు