22వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

30 Nov, 2017 09:30 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ప్రారంభమైంది. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదుగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి కుప్పలదొడ్డి, బిల్లకల్‌ వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగతుంది. రాత్రికి బిల్లకల్‌లోనే వైఎస్‌ జగన్‌ బస చేయనున్నారు.

మరిన్ని వార్తలు