పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు

22 Nov, 2015 11:35 IST|Sakshi

జమ్మలమడుగు : పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో సుమారు 25 మందికి గాయాలు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు సమీపంలోని ఎత్తులేటికట్ట వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పెద్దమొడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి పెళ్లికూతురు తరఫువారు సుమారు 60 మంది బస్సులో పులివెందులకు బయల్దేరారు.

ఈ బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఎత్తులేటికట్ట వద్ద బోల్తా పడింది. 25 మందికి గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పెళ్లి కుమార్తెతో ఉన్న బస్సు గంట ముందే బయల్దేరి వెళ్లింది.

మరిన్ని వార్తలు