27 శాతం ఐఆర్‌పై జీవో..1 నుంచి అమల్లోకి

7 Jan, 2014 02:02 IST|Sakshi

 సాక్షి, హైదరాబవాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో 27 శాతం ఐఆర్‌కు ప్రభుత్వం అంగీకరించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో చేతికి అందే జనవరి జీతంతోపాటు ఐఆర్ ఉద్యోగులకు ఐఆర్ అందనుంది. ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు