పెళ్లికారు బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి

25 Apr, 2016 09:47 IST|Sakshi

ఆలమూరు(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వీసాకోడేరు గ్రామంలో మహేష్‌రాజు, దేవీప్రియాంక వివాహం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరిగింది. అనంతరం నూతన దంపతులు బంధువులతో కలసి మొత్తం 12 మంది కారులో అన్నవరం దర్శనానికి బయలుదేరారు.

వారి వాహనం ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలోని మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. అనంతరం పక్కనే ఉన్న పంటకాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న కృష్ణశ్రీ, మాధవీశ్రీ అనే పదేళ్లలోపు బాలికలు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా 10 మంది గాయాలపాలయ్యారు. నూతన వధూవరులకు స్వల్పగాయాలయ్యాయి. మిగతా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.

మరిన్ని వార్తలు