రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

9 Aug, 2015 14:47 IST|Sakshi

తూర్పుగోదావరి(కడియం): ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, సెప్టిక్‌ క్లీనింగ్‌ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ సంఘటన కడియం మండలం వేమగిరి గట్టుపై ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా రాజమండ్రికి చెందినవారని సమాచారం.

మరిన్ని వార్తలు