బస్సుబోల్తా 30మందికి గాయాలు

7 May, 2015 06:25 IST|Sakshi

శ్రీకాకుళం: ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ప్రైవేట్ వాహనాలని ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు జంక్షన్ వద్ద అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.

క్షతగాత్రులను రిమ్స్ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు