30 కిలోల గంజాయి స్వాధీనం

17 Oct, 2015 18:11 IST|Sakshi

అనంతగిరి (విశాఖపట్నం) : అక్రమంగా కారులో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో శనివారం సాయంత్రం జరిగింది. ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రానికి స్విఫ్ట్ కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయితో పాటు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు