కార్డాన్ సెర్చ్‌లో 360 మద్యం బాటిళ్లు స్వాధీనం

28 Jun, 2015 08:26 IST|Sakshi

మచిలీపట్నం : కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని నవీన్‌మిట్టల్ కాలనీలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డాన్‌ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో భాగంగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 360 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 11 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు