కడప: జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా.. అసలు విషయం బయటపడింది. వీరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి నాలుగు చోట్ల చోరీలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వీరి వద్ద నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.