టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల అరెస్ట్

8 Jul, 2015 14:19 IST|Sakshi

శ్రీకాకుళం : ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూనరవికుమార్ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సరుబుజ్జిలి మండలానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులను అరెస్ట్ చేసినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. బాలానగర్ కేంద్రంగా ఆముదాలవలసలో నకిలీనోట్లు చలామణి చేస్తున్నారన్న ఆరోపణలతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నడికుర్తి వసంతరావు, సీపాన చవిటినాయుడు, లక్ష్మణరావు, అన్నెపు ఈశ్వరరావులు అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందికి సంబంధం ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు