నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

3 Aug, 2015 17:02 IST|Sakshi

సరుబుజ్జిలి (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట మండలం రావిచంద్రాపురం గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురిని సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

ముందస్తు సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, వారి వద్ద నుంచి రూ.5,750 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై చెప్పారు.
 

మరిన్ని వార్తలు