ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

11 Aug, 2015 09:35 IST|Sakshi

గుంటూరు(ప్రత్తిపాడు): ఓ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. చీరాల నుంచి గుంటూరుకు వెళుతున్న ఆటో ప్రత్తిపాడు వద్ద రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. బాధితులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

మరిన్ని వార్తలు