గుట్టు చప్పుడు కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి 45 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 75 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె వన్టౌన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.